హెచ్ పి వి వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ నాగయ్య.
కోదాడ, నేటి ధాత్రి: 15
సంవత్సరాల పిల్లలు హెచ్ పి వి వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మందుల నాగయ్య అన్నారు. సోమవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు (హెచ్ పి వి) వ్యాక్సిన్ ను వేయించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను నివారించడానికి 14 ఏళ్ల వయసుగల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందించి క్యాన్సర్కు కారణం అయ్యే హెచ్ పివి వైరస్ నుండి ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యాధిని నివారించడానికి హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాక్సిన్ ను 15 ఏళ్ల పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, జిపిఓ ఈశ్వర్, ఏఎన్ఎం. చంద్రకళ, సూపర్వైజర్ విజయ్, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు బాలికలు తదితరులు ఉన్నారు.
