ఆర్యవైశ్య కుటుంబానికి అండగా…ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ – ఉప్పల వెంకటేష్.

ఆర్యవైశ్య కుటుంబానికి అండగా…ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ – ఉప్పల వెంకటేష్.

కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి మున్సిపాలిటీకి,సుభాష్ నగర్ చెందిన ఆర్యవైశ్య కారుపాకుల వరుణ్ తేజ్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్య వైశ్య సంఘం నాయకుల ద్వారా శనివారం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం 5000/-అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాచోటి శ్రీశైలం,ఆర్య వైశ్య సంఘం కల్వకుర్తి మండలం అధ్యక్షులు గంధం ప్రసాద్, ఆర్య వైశ్య సంఘం జిల్లా నాయకుడు దాచపల్లి శ్రీనివాసులు, ఉప్పల వెంకటేష్ అన్న సైన్యం దారమోని గణేష్ ,BRS పార్టీ మాజీ కౌన్సిలర్ సాదిక్,కనుక సత్యనారాయణ,షకీల్, ఆర్య వైశ్య సంఘం నాయకులు తిరుపతయ్య, శ్రీనివాస్ గుప్తా, పోల నరేష్, ఆకారం శివ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version