ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి.

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలా మాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సామాజిక సంఘ సంస్కర్త,సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు విద్య కోసం జీవితాంతం కృషి చేసిన సంఘసేవకుడైన మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతి సందర్బంగా వారి సేవలను స్మరిస్తూ.వారికి నా ఘన నివాళులు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ ,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, వార్డ్ అధ్యక్షులు దత్తాత్రేయ,అలి,వెంకట్,విశ్వేశ్వర్,
బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్,నాయకులు తులసి దాస్ గుప్తా,రాజ రమేష్ ,జగదీశ్వర్,ఆనందం,ప్రవీణ్ పాటిల్,ఎజాస్ బాబా,గణేష్ ,నర్సింహ రెడ్డి,దీపక్,లక్ష్మీకాంత్,మోహన్ తదితరులు పాల్గొన్నారు

ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి.

ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మాట్లాడుతూ దేశానికి జ్యోతిబాపులే అందించిన సేవలను స్మరించుకున్నారు. వర్ణవివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ,మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన కార్యచరణ మహోన్నతమైందని తెలిపారు. భారతదేశంలో అట్టడుగు వర్గాల పై జరుగుతున్న దాస్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడాయన.కుల లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయని పూలే ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతి బాపులే ను స్మరించుకుంటూ ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. జ్యోతిబాపూలే విద్యా కు ఇచ్చిన ప్రధాన్యత తో వెనబడిన తరగతుల గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలుగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసుకున్నామని వెల్లడించారు. బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు పెంచడానికి చట్టం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలతో ముందుకు పోతున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కనుమల్ల సంపత్, పెద్ది శివకుమార్, గోలి కిరణ్ , గుడిశాల పరమేశ్వర్ , బొమ్మ శీను , మారపల్లి ప్రశాంత్ , కారింగుల రాజేందర్,మీస రాజయ్య, గంగారపు మహేష్ ,కోడం శ్రీనివాస్, తోడేటి కిషన్ ,గురుకుంట్ల స్వామి , అన్నారపు సాయి, బండి మల్లయ్య ,మ్యాడిద తిరుపతిరెడ్డి, కారెట్ల పెళ్లి మణి, మోటపోతుల రాము, దారా నరేష్, జక్కు కుమార్ ,మంకు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి.!

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.

కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి;*

 

అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడు,భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి కార్యక్రమాన్ని నర్సంపేట టౌన్ దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు నిర్వహించారు. దళిత రత్న,దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ కళ్ళేపెళ్లి ప్రణయ్ దీప్ ఆధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దళిత ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గద్ద వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయకులు జనగాం కుమార్,అందె రవి దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ దళిత రత్న గుంటి వీర ప్రకాష్ దళిత ప్రజాసంఘాల జేఏసీ కో కన్వీనర్ తడుగుల విజయ్ లు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత నేత బీహార్ లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బోయిని నారాయణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు సాంబయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు గిరిగాని శ్రీనివాస్, కుల పెద్దలు మాదాసి సదానంద,కరుణాకర్, నవీన్, రాజు,మాల మహానాడు నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో.!

బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న టి ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్. నేటి ధాత్రి

 

భారత దేశ మాజీ ఉపప్రధాని డా:బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చెర్మెన్ వై.నరోత్తం పస్తాపూర్ గ్రామంలో గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి,మరియు కోహిర్ మండలం చింతల్ ఘాట్ చౌరస్తా వద్ద గల బాబు జగ్జివన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా జరిగిన పస్తాపూర్ గ్రామంలో ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతూ వారు దేశానికి ఎంతో సేవ చేసారని కుల రహిత సమాజం కొరకు, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు పోరాడిన మహానేత అని వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ మనమందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్, మాజీ ఎంపీటీసీ సంపత్ కుమార్,రాజేందర్,రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు సి.బాల్ రాజ్,ధన్ రాజ్,సామెల్,విఠల్,చెంగల్ జైపాల్,రాజ్ కుమార్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

: రాజానెల్లి ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం రాజానెల్లి గ్రామంలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతదేశ మాజీ ఉప ప్రధానీ మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రెండ్స్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ , డీ .ధనరాజ్ మాట్లాడుతూ. బాబు జగ్జీవన్‌ రామ్‌ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ అని, పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కృషి చేసిన సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అణగారిన ప్రజలకు సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు , నేటి యువత ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలోడి ధనరాజ్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ . మధుకర్. బాగప్ప.ఏవన్ గోల నర్సింలు. గోల సురేష్.హబ్రహం. మెషె. పి.లక్మ్యాన్. చింటూ . సంగన.ఈశ్వర్.కజమియా.ఉపరి వినయ్. జ్యోత్ . నాగప్ప పటేల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో ఇందిరా గాంధీ ఎదురులేని నాయకురాలుగా ఉన్న సమయంలో ఆమెకు ఎదురు తిరిగిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ ఆయన బీహార్ రాష్ట్రంలో చాంద్ గ్రామంలో 19O8 ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు.తల్లి వసంతి దేవి తండ్రి శోభిరామ్ లు ఆయన చిన్నతనంలోనే స్కూల్లో హిందువులకు ఒక కుండ క్రైస్తవులకు ఒక కుండా ముస్లింలకు ఒక కుండా అంటరాని వాళ్లకు ఒక్కకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కుండలను చూసి చలించిపోయి అందరికీ ఒకే కుండా ఉండాలన్న ఆలోచనతో అన్నిటిని మొదలుపెట్టడం జరిగింది. మనుషులంతా ఒక్కటే ఒకే కుండలో అందరం తాగాలి అని ఒక గొప్ప మనసుతో ఆలోచించేవాడు, బాబు జగ్జీర్రావ్ తండ్రి శోభిరామ్ సైన్యంలో పనిచేసేవాడు, అక్కడ అంటరానితనం వివక్ష చూసి అక్కడి నుండి ఇంటికి వచ్చి 20 ఎకరాల భూమి లో వ్యవసాయం చేస్తూ, అంటరానితనం కులవ్యక్ష మీద ప్రజలకు చైతన్యం చేయడంజరిగింది. బాబు జగ్జీవన్ రావు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుని పేరు సురేషు కూతురు పేరు మీరా కుమారి కలరు.
ఆయన సామాజికంగా ఆర్థికంగా పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు 1929లో అంటరాని ప్రజల గురించి ఉత్తర ప్రదేశ్ బెంగాల్ బీహార్ ప్రజలను సమీకరించి 35 వేల మందితో ఊరేగింపు నిర్వహించాడు. ఆయన జీవితంలో అదొక గొప్ప చరిత్ర కలిగిన రోజు అదే ఆయన రాజకీయానికి పునాది 1935లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో బాబు రాజేంద్రప్రసాద్ తో స్నేహం ఏర్పడింది,బాబు జగ్జీరావ్ 1931లో గొప్ప సైంటిస్ట్ కావాలని నిర్ణయంతో సైంటిస్ట్ ను అయితే నేను బాగుపడతా నా కుటుంబాలు బాగుపడతాయి, కానీ పేద బడుగు బలహీనవర్గాల పరిస్థితి ఏంటి అని నిర్ణయించుకొని అంటరాని వాళ్ళు కులవ్యవక్షత దుర్భారం గడుపుతున్న మా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వారి గురించి, నేనే పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఆలోచన చేస్తాడు అంటరాని వాళ్ళు చదువుకోవాలి అంటరాని వాళ్ళు మద్యపానం నిషేదించాలి పిల్లలను పశువుల కొట్టలాల్లో పనిచేయడం మానేయాలి,
నా జాతి పిల్లలు చదువుకోవాలి అని కొన్ని అభిప్రాయాలతో అట్టడుగు వర్గాలకు ఒక దిక్సూచిగా నిలిచాడు, ఆయన జీవితంలో 50 సంవత్సరాలుగా ఓటమెరుగని పార్లమెంటు సభ్యులుగా గొల్లిపొందిన మహా ఉన్నతమైన వ్యక్తి, ఆయన ఈ భారత దేశ ఉప ప్రధాని పనిచేశారు, ఆయన ఈ దేశ కేంద్రకార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో ఎయిర్ ఇండియా జాతీయం చేశారు, అందులో 7000 ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అమలు చేశారు, అదే విధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల ఉద్యోగాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అమర్
మాల మహానాడు కార్యదర్శి టంకరి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షులు బండారి ఎల్లం,ఎరుకల సంఘం మండల అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్, కొతాడి నర్సింలు, ఎండి బిలాల్, కొమ్మాట స్వామి, నందిగామ బాబు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 110 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు..

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

నేడు రామాయంపేట పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది డాక్టర్ జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గంలో జన్మించి భారతదేశ ఉన్నతమైనటువంటి పార్లమెంట్ యొక్క స్థాయిలో అనేక పదవులను అధిరోహించి భారత దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయన అనుభవించడం జరిగింది నాటి కాలంలో అంటరానితనం భయంకరంగా ఉన్నప్పటికీని అంతా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు పార్లమెంటులో ఆయన గళం విప్పారు పోరాడినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన మానవ అట్టడుగు వర్గాల హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ ఫైటర్గా పోరాటం చేసిన మహనీయుడు ఆయన సేవలు మరువలేని కాబట్టి ఆయన చిరస్మరణీయులు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఈ యొక్క కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా లైన్స్ క్లబ్ వారు కూడా పాల్గొనడం జరిగింది బీసీ సంఘం నాయకులు మెట్టు గంగారం బీసీ నాయకులు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ దళిత నాయకులు కరికివిద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాతూరి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లద్ద నర్సింలు మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుడుం పెంటయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మల్యాల కిషన్ మాదిగ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అక్కిరి గారు రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు జేరిపోతుల అశోక్ గడ్డం సిద్ధరాములు ఎర్ర రాములు లైన్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ కైలాష్ గారు ఇంకా తదితరులు పాల్గొన్నారు

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి. 

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 6 ఏరియాలోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం యువజన విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు
బి.సదానందం ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.నర్సింగ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్
బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసిన ఘన నివాళులు అర్పించారు.అనంతరం జె. నర్సింగ్ మాట్లాడుతూ..
దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర పోరాట యోధుడు అణగారిన వర్గాల సంక్షేమం కోసం సంఘ సంస్కర్తగా అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి సంకల్పించిన వీరుడు బాబు జగ్జీవన్ రామ్ వారు మన దేశానికి తొలి దళిత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆదర్శ పాలక అధ్యక్షులుగా పేరు గడించారని తెలియజేశారు.అలాగే అతి పిన్న వయసులో మంత్రి బాధ్యతలు చేపట్టి భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా 40 ఏళ్ల పాటు భారత దేశ పార్లమెంట్ లో వివిధ మంత్రి పదవులను చేపట్టిన గ్రామీణ కార్మికుల కోసం అణగారిన వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ పని చేసే వారని అలాంటి మహనీయుడైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ యొక్క 118 వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మంచిర్యాల నియోజకవర్గ కమిటీ మరియు యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అభినందనీయమైనది అని అన్నారు.ఈ కార్యక్రమంలో
సంక్షేమ సంఘం నస్పూర్ మున్సిపాలిటీ ప్రచార కార్యదర్శులు సిహెచ్ వాసు,టి.విజయ్ యూత్ నాయకులు,సుజిత్,ప్రజ్వాల్, జశ్వంత్,అరవింద్,బబ్లూ, నరేష్,తేజ,యశ్వంత్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

అంబేద్కర్ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు. 

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ అంబేద్కర్ కాలనీ లోని అంబేద్కర్ భవనం లో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా మహానీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కొప్పర్తి రాజం మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు కోప్పర్తి రాజం, మడుగుల శంకర్,జిలకర రాజం,యువ నాయకులు మడుగుల స్వామి దాస్, మడుగుల మహేష్,కొప్పర్తి చింటూ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ 118 జయంతి

దళిత సింహం జగ్జీవన్ రామ్-ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి

పరకాల నేటిధాత్రి

 

పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానిడాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏకు శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత సింహమని బీహార్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో 198లో ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జన్మించారని ఆయన జన్మదినాన్ని భారతదేశమంతట సమతా దివసుగా జరుపుకుంటారన్నారు.అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి షెడ్యూల్ కులాలను ఆయన సంఘటితం చేశారని,బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనేవారని తెలిపారు.సామాజిక చైతన్యం సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆల్ ఇండియా డిప్రెసెడ్ క్లాసెస్ లీగ్అఖిల భారతీయ రవిదాస్ మహాసభకు పునాది వేశారని అలాగే 1935లో అక్టోబర్19న దళితులకు ఓటు హక్కు కోసం హమండ్ కమిషన్ ముందు వాదన వినిపించారన్నారు.రాజ్యాంగ సభలో సభ్యుడుగా ఆయన పాత్ర ఎనలేనిదని దళితుల సామాజిక న్యాయ రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటుచేసిన తాత్కాలిక ప్రభుత్వ క్యాబినెట్ లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి తర్వాత కమ్యూనికేషన్,రైల్వే,రవాణ,ఆహార,వ్యవసాయ,రక్షణ వంటి కీలక శాఖలో బాధ్యతలు నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడానికి జగ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్ఎఫ్ నాయకులు బొచ్చు సంపత్ మాదిగ,దైనంపెళ్లి అజయ్ మాదిగ,ఒంటేరు మహేందర్ మాదిగ,ఏకు ప్రణయ్ మాదిగ,ఒంటేరు చరణ్ మాదిగ లు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.

ఎమ్మార్వో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో అధ్యక్షతన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు ఫోటోలకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు,!

కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల బాంధవుడు,మాజీ ఉపప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంత శుభాకాంక్షలు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజికవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం లో పట్టణ కేంద్రం పస్తపుర్ లో అరుంధతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఉద్యమకారులతో కుల సంఘాల నాయకులతో కలసి కేక్ కాట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరిచిపోలేనివి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు పోరాట కార్యక్రమాలు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడిన పోరాట యోధుడు ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుచుకొని మన దేశ రాష్ట్రాలను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరం అన్నదమ్ముల వలె నడుచుకొని మనకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిదీ కూడా అందరం కలిసికట్టుగా ఆలోచించి పని చేస్తే మనం విజయాన్ని చేకూర్చుకుంటాం బాబు జగ్జీవన్ రావ్ 1935లో దళితులకు సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు , ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు ఆయన జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో , కార్మిక మంత్రిగా భారతదేశపు మొదటి మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యారు మరియు భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా కూడా పనిచేశారు , అక్కడ ఆయన సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా తదుపరి 30 సంవత్సరాలు వివిధ శాఖలతో మంత్రిగా పనిచేశారు .

Birth anniversary.

 

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు,హుగ్గేలి రాములు,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, మరియు అరుంధతి సంఘం సభ్యులు,వరాలు, రామచందర్,ముర్జల్ గారు,జైరాజ్, శాంసన్ గారు,చిన్న గారు,రాజు తతిధురులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన దళిత నాయకులు పూడూరి మల్లేశం. ఈకార్యక్రమంలో పురాణం రమేష్, కొలిపాక కమలాకర్, దాసరి అంజయ్య, కల్లెం తిరుపతి, అమరగోండ బీరయ్య, దాసరి గంగయ్య, దాసరి శేఖర్, గంధం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం ఎంపిడిఓ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమానికి ఎంపిడిఓ ముఖ్య అతిధులుగా హాజరైయ్యరు, కార్యక్రమము లో హద్నూర్ హెచ్ఎం అమృత్ సార్, ఎపిఓ రాజ్ కుమార్,బర్ధిపూర్ మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, మాజీ సర్పంచ్ పెంటయ్య, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, డాక్టర్ జాన్ శ్రీకాంత్,బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్,నాయకులు మాటూర్ రాజ్‌కుమార్, డప్పుర్ సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి, వై నగేష్, ఎం విష్ణు,రాజేందర్,పాండు ముదిరాజ్,, సోషల్ మీడియా దిగంబర్,మోనిరిటీ యూత్ వైస్ ప్రెసిడెంట్ ,ప్రవీణ్ మరియూ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది,నాయకులు,వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గోని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి.

సిరిసిల్ల జిల్లా సినారే గ్రంథాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి
* పాల్గొన్న గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్*

* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*

 

 

సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

Sinare Library

 

ఈకార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గారు శ్రీ నాగుల సత్యనారాయణ గారు గ్రంథ పాలకుడు కమటం మల్లయ్య పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Sinare Library

 

ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

ఝరాసంగం పంచాయతీ కార్యాలయంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రాం 117వ జయంతి వేడుకలు ఝరాసంగం మండల కేంద్రమైన గ్రామపంచాయతీలో ఘనంగా జరిగాయి. ప్రముఖులు ఆయన చిత్రపటాన్ని స్పెషల్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని పలువురు నాయకులు కొనియాడారు. అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని వెల్లడించారు. జగ్జీవన్​రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ సాబ్ సంగమేశ్వర్ నర్సింలు మోహన్ ఏ వన్ మరియు తదితరలు పాల్గొన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి.

మహనీయుల జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడలిలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో “మహానీయుల స్ఫూర్తి యాత్ర” కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసయ్య హాజరై మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో మహనీయుల జయంతి సందర్భంగా మండల కేంద్రంలో మహనీయుల స్ఫూర్తి యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా జక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన బాపు జగ్జీవన్ రామ్ ఏప్రిల్ 11వ తేదీన మహాత్మ జ్యోతిరావు పూలే ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు వర్ధన్నపేట మండలంలోని గ్రామాలలో మహానీయుల స్ఫూర్తి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ యాత్రలో భాగంగా మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి గడపగడపకు చేరవేసి వారి ఆశయాలను కొనసాగింపుగా యువతలో చైతన్యాన్ని కల్పిస్తూ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్య పరుస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మహానీయుల జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మరిపట్ల అంజయ్య, ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, టిఎంఆర్పిఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు ఈరెల్లి శ్రీనివాస్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్, జాతీయ బీసీ సంక్షేమం సంఘం వర్ధన్నపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కో కన్వీనర్ జంగిరి భాస్కర్,ప్రజా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెపాక చంద్రమౌళి, వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ సంఘం వర్ధన్నపేట పట్టణ అధ్యక్షులు నందిపాక భాస్కర్, స్వామి, ఎస్టి నాయకులు భీమా నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు కుమారస్వామి, గణేష్, ప్రభాకర్, రమేష్, లాలు నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన.!   

వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదర్శ మోడల్ స్కూల్ యాజమాన్యం.  

మందమర్రి నీటి ధాత్రి

 

మందమర్రి పట్టణం లోని తెలంగాణ ఆదర్శమోడల్ పాఠశాల లో జూనియర్ కాలేజీ విద్యార్థుల తో వార్షికోత్సవ (అనివార్సరీ) వేడుకలు ఘనంగా నిర్వహించరు ముందుగా సరస్వతి పూజ జ్యోతిప్రజ్వాల వెలిగించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించిన మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్లిమా
ప్రిన్సిపాల్ మాట్లాడుతూ

Adarsh ​​Model School.

మీ తల్లిదండ్రులు కష్టాన్ని మీరు గమనించి జీవితంలో మంచి స్థాయి కి ఎదిగి వారిని సంతోషపెట్టాలని ఆ దిశ గా లక్ష్యాన్ని ఏర్పార్చుకోవాలని కోరారు

Adarsh ​​Model School.

విద్యార్థులు చేసిన జానపద నృత్యలు, యోగ విన్యాసాలు,వివిధ పాటలు లంబాడి నృత్యంలు పలువురు ని అలరించాయి ఈ కార్యక్రమం లోప్రిన్సిపాల్ సారా తస్లిమ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయలు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version