17వ వార్డులో బీఆర్ఎస్ జోరైన ప్రచారం…

17వ వార్డులో బీఆర్ఎస్ జోరైన ప్రచారం

అందుబాటులో ఉంటాం ఆదరించండి

పరకాల,నేటిధాత్రి

 

 

మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో అభ్యర్థి రజిని నవీన్ లతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థితో పాటు స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్బంగా శనిగరపు రజిని నవీన్ మాట్లాడుతూ నమ్మకంతో గెలిపించండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.వార్డులో తాగునీరు,డ్రైనేజీ,రోడ్ల అభివృద్ధి,పారిశుధ్యం వంటి సమస్యలపై పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపుతామని అన్నారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు ఆముదాలపల్లి అశోక్ గౌడ్,పార్టీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version