కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన.

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన టి ఆర్ హెచ్ ఎస్ ఎస్ అధ్యక్షుడు

◆ -సంగారెడ్డి జిల్లా టిఆర్ హెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్స్ 102, 103,ప్రభుత్వ భూమి 70 ఎకరాల గల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని పత్రిక ప్రకటన చూసి స్పందించిన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇంచార్జి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల ఒక వంద రెండు (102)ఒక వంద మూడు(103) సర్వే నంబర్లు గల 70 ఎకరాల భూమిని ప్రవేట్ వ్యక్తులు కబ్జా చేశారని వెంటనే చర్యలు చేపట్టి అట్టి ప్రభుత్వ భూమిని విచారణ చేపట్టి పేద ప్రజలకు ఆ ప్రభుత్వ భూమిని అందజేయాలని కోరినాడు. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ కోహిర్ మండల్ రైతు హక్కుల సాధన సమితి సభ్యులు, నాగిరెడ్డిపల్లి గ్రామస్తుడు మీద్ద్య మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version