వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసనా కార్యక్రమం
జమ్మికుంట నేటిధాత్రి:
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగిణి జమ్మికుంట శాఖ వారు జమ్మికుంట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆరు నెలల నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు ఈరోజు ఉదయం 7 గంటల నుండి 10 30 నిమిషాల వరకు స్వర్ణామృత ప్రాసన కార్యక్రమంలో 210 మందికి డ్రాప్స్ వేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వికాస్ తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ వచ్చు వీర లింగం ముక్క శివకుమార్ దేవాలయం ప్రధాన చార్యులు లింగరి హరికృష్ణ మాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ ముక్క జితేందర్ గుప్తా ట్రెజరర్ అంతం రాజిరెడ్డి పుల్లూరు ప్రభాకర్ రావు మరియు కమిటీ సభ్యులు మహిళా వికాస్ తరంగణి సభ్యులు 50 మంది పాల్గొన్నారు