స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి:

కామారెడ్డి జిల్లా శ్రీ రామకృష్ణ సేవా సమితి – కోటగిరి వారి ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద హై స్కూల్ ప్రాంగణంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని మంగళవారం విష్కరించారు. రామకృష్ణ మఠం-హైదరాబాదు అధ్యక్షుడు బోదమయానంద స్వామీజీ, విగ్రహ దాత జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. వారు మాట్లాడుతూ…యువత స్వామి
వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, సామజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్, పీవీ సుబ్బారావు, ఖర్గే శ్రీనివాస్, వివేకానంద స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గోగినేని రజిని శ్రీనివాస్, గజు పటేల్ మాజీ సోసైటీ చైర్మన్ పండిత్ రావ్ పటేల్. రామ్ పటేల్ ఇందురు స్కూల్ కరస్పాండెంట్ కోడలి కిషోర్, పోల విఠల్ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!