మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత..

స్పందించిన అధికారులు

పెద్దపల్లి “నేటిధాత్రి”
మానేరుపై అక్రమ వసూళ్ళ నిలిపివేత.. టోల్‌గేట్ తొల‌గింపు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వ‌ద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్‌గేట్‌ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించారు.
“నేటిధాత్రి”పత్రికలో ఫిబ్రవరి 11 వ తారీకున వచ్చిన అధికారుల అండదండలతో కోట్లకు పడగలెత్తుతున్న దళారీలు అనే కథనంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించారు.

మానేరు నది వ‌ద్ద‌కు చేరుకున్న మంథని సీఐ రాజు, ఆర్‌ఐ శ్రీధర్‌ల ఆధ్వర్యంలో అధికారుల బృందం అక్కడికి చేరుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్‌నును తొలగించారు. ఎలాంటి వసూళ్ల‌కు పాల్పడవద్దని అక్కడ టోల్‌గేట్ నిర్వాహకులను హెచ్చరించారు. దీంతో నిన్న మొన్నటి వరకు అనధికారికంగా వసూలు చేసిన టోల్ టాక్సీ బెడద ఆయా గ్రామాల ప్రజలకు తప్పింది. ఆ మట్టి రోడ్డుపై ప్రయాణం చేసే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను వెలికి తీసిన “నేటిధాత్రి” కి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version