లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్
సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చంద్రం పేటలో దాడిచేసి ఓ సర్వేయర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు.
15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 15000 లంచం తీసుకుంటుండగా పెట్టుకున్న ఎసిబి అధికారులు.
నాగరాజు ను ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ కార్యాలయం కు తరలించి విచారిస్తున్న అవిశా అధికారులు.జక్కాపురం మల్లేశం స్థలం కొలిసినందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసి 80 వేలకు డీల్ కుదుర్చుకున్న సర్వేయర్.గతంలో 21 వేలు ఇవ్వగా, నేడు 15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సర్వేయర్ గురించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.