అనాధలకు అండగా పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి కొమ్మ గిరి వెంకటేశ్వర్లు

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచల పట్టణంలో అభాగ్యులైన అనాధలకు తమకున్న దాంట్లో పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు భోజన సదుపాయం కల్పించటం జరిగిందని కొమ్మ గిరి వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాచల పట్టణంలో అనేకమంది ఒక పూట అన్నం తినడానికి దొరకక ఎందరో వృద్ధ దంపతులు ఇబ్బంది పడుతున్నారని సేవ గుణం ఉన్న మానవతావాదులు ముందుకొచ్చి వృద్ధ దంపతులకు భోజన సదుపాయాన్ని అందించేందుకు సహకరించాలని వారు కోరారు. పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి పేద వృద్ధ వికలాంగుల అనాధల కోసం వారిని ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని, ప్రతి ఒక్క మానవతావాది హృదయం కలిగిన సేవాగుణం కలిగిన ప్రతి ఒక్కరు పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితికి సహకరించి ఆదరిస్తారని విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో హరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి సభ్యులు భూక్య కిషన్ వినోద్ కుమార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *