హన్మకొండలో నిరుపేద కుటుంబానికి సాయం

నిరుపేద కుటుంబానికి చేయూత

నేటిదాత్రి :హన్మకొండ

 

ఇటీవల కాలంలో బండారి లక్ష్మి ముదిరాజ్ అనారోగ్య రీత్యా మరణించిన నేపథ్యంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి తాళ్ళ రవీందర్, సింగారపు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ కుల పెద్దలు దండు నర్సయ్య, దండు రవి, దండు రాజు సమక్షంలో బాధిత కుటుంబానికి 10,000 పదివేల రూపాయలు క్వింటల్ బియ్యం అందజేశారు.

అనంతరం సంఘం నేతలు వార్డు మెంబరు మేక సుమలత రాజు, గంగరబోయిన నిరంజన్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, కూలి పనికి వెళ్లి వచ్చి కట్టుకున్న భార్య లక్ష్మి తన కళ్ళ ముందు చనిపోతుంటే చూసి నిస్సహాయ స్థితిలో ఉన్న కొమురయ్య పరిస్థితి, కుటుంబ దయనీయ ఆర్థిక స్థితిని అర్థం చేసుకొని

పిఆర్ ముదిరాజ్ సేవా సమితి పెద్దలు సిద్దిపేట మాజీ కౌన్సిలర్ పెసరు రాజన్న
గ్రామ వాస్తవ్యులు కె ఎస్ ఆర్ అభ్యాస్ విద్యాసంస్థ చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి కుల ప్రముఖులు, దాతల సహకారంతో బాధిత కుటుంబానికి సాయం చేయడం చాలా గర్వకారణమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ముదిరాజ్ జాతి ఐక్యతకు దోహదపడతాయని, ముదిరాజు బిడ్డలు దానం చేసే స్థాయికి ఎదగాలని కోరారు.

ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సేవకులు ముద్రబోయిన రమేష్
దండు రవి, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు దండు నర్సయ్య, కార్యదర్శి దండు రాజు, డైరెక్టర్ మేక అనిల్, మేక సుమలత రాజు;
గౌరవ సలహాదారులు గాలిబు సంపత్, గంగరబోయిన నిరంజన్ వాడకట్టు కుల బంధువులు కుమ్మరికుంట్ల రాంబాబు, భూమ సంపత్, పొన్నం, కోమ్మయ్య, దండు రాజేందర్ , రాములు కుమ్మరికుంట్ల చంటి యువజన నాయకులు గంగరబోయిన నవీన్, దండు ఉదయ్ కిరణ్, సందీప్, దండు రమేష్, సాంబయ్య, దండు బాలయ్య, దండు చిరంజీవి ముదిరాజ్; బండారి లక్ష్మి కుటుంబ సభ్యులు కొమురయ్య, కూతురు ఎలా స్వాతి, సంధ్యరాణి, సిరి చందన, రిక్విత మణికుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version