పాత బస్టాండ్ పునః ప్రారంభ పనులను ప్రారంభించిన అధికారులు.
పర్యవేక్షించిన అఖిలపక్ష ఐక్యవేదిక.
వనపర్తి నెటిదాత్రి:
వనపర్తి పాత బస్టాండ్ పున ప్రారంభించడానికి అధికారులు కాంట్రాక్టర్ పని ప్రారంభించడంతో, మూడు సంవత్సరాలుగా పోరాటం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాతబస్టాండ్ లో
పనులు పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వనపర్తి వివిధ గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అఖిలపక్ష ఐక్యవేదిక ప్రజల పక్షాన ఉంటుందని ప్రజా సమస్య ఉన్నచో అక్కడ పోరాటం మొదలవుతుందని అఖిల పక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు. పాత బస్టాండ్ ను ప్రయాణికులకు ఉపయోగ ములో కి వస్తూన్నదుoకు ఆర్ టి సి అధికారులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు అక్కడ ఉన్న చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని సతీష్ యాదవ్ కోరారు
సతీష్ యాదవ్ రాష్ట్ర టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, పుట్టపాకల బాలు రాజేష్ యాదవ్ తదితరులు ఉన్నారు