ఘనంగా సుంకిరెడ్డి జన్మదిన వేడుకలు
కల్వకుర్తి/ నేటి ధాత్రి
సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తిలోని కైలాసగిరి పై వెలసిన పడమటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన దేవాలయాలు మన హిందూ యొక్క ప్రఖ్యాతిని చాటుతాయని వాటిని ప్రతి ఒక్క హిందువు పైనే ఆధారపడి ఉంటాయని అందుకుగాను తన వంతు సహాయం చేస్తానని చెప్పడం జరిగినది హిందూ ఐక్యత పౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆయనను సన్మానించడం జరిగినది. అనంతరం సికేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన 5000 మందికి 50 కంపెనీలతో మేళా నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని తన యొక్క లక్ష్యంగా చెప్పడం జరిగినది. ఇందులో భాగంగా శ్రీను, శేఖర్ రెడ్డి, మల్లేష్, మహేష్, పాండు, శశాంక్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.