ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

High Court. High Court.

హైకోర్టు ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

సొసైటి చైర్మన్ ను సన్మానించిన పలువురు నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవీకాలం గత మూడు నెలల క్రితం ముగియడంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణ చేయలేకపోయిన
ప్రభుత్వం మరల అదే పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన
సుకినే రాజేశ్వర్ రావు మాత్రం భాద్యతలు ఇవ్వలేదు.దీంతో నర్సంపేట డివిజన్ పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సొసైటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వీరి వాదనలు విన్న హైకోర్టు మరల బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర,జిల్లా సహకార అధికారులకు ఉత్తర్వుల జారీ చేసింది.
కాగా గురువారం సుకినే రాజేశ్వర్ రావు ఇంచార్జీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ నాచినపల్లి వ్యవసాయ సహకార సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ రైతులకు అందుబాటులో ఎరువులను అందించే విషయంలో ముందుంటామన్నారు. రైతులకు సంబంధించి క్రాఫ్ లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో సి. గ్రేడ్ ఉన్న సహకార సంఘాన్ని ఏ. గ్రేడ్ కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.డైరెక్టర్ల సహకారంతో రైతుల సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని రాజేశ్వర్ రావు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ రావు ను మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి చంద్రమౌళి, మాజీ చైర్మన్ గుడిపల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు గొర్రె జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బొరాల లింగయ్య తిమ్మంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రె జనార్దన్ రెడ్డి,నా చినపల్లి గ్రామ అధ్యక్షులు నర్రా రంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నల్ల శ్యాంసుందర్ రెడ్డి, గొసంగి పురుషోత్తం, మెరుగు రాజు, తుమ్మలపెల్లి సదానందం, హనుమకొండ లలిత బాబు, సాంబయ్య,సురావు సంజీవరావు, మోకిడే ప్రభాకర్, నరహరి భాస్కర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!