మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు కృషి చేయాలి

students students

మాదక దవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి*
మొగులపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆదేశాలతో ఏఎస్ఐ రాజేశం మత్తు పదార్థాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజేశం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు ఎంతగానో కృషి చేయాలి విద్యార్థులు మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు సర్వ నాశనం అయితాయని వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఆధారం విద్యార్థుల అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో నివేది ఏ స్థితిలోనైనా డ్రగ్స్ కు పొరపాటున కూడా అటువైపు వెళ్ళకూడదు , ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైన లేదా మాదకద్రవ్యాల గురించి సమాచారం తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు. డ్రగ్స్ కి సంబంధించిన సమాచారాన్ని అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అదేవిధంగా విద్యార్థులతో సే నోటు డ్రగ్స్ pledge చేయించారు , మరియు స్థానిక పోలీస్ స్టేషన్ లో am an యాంటీ డ్రగ్ సోల్జర్ selfi point ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా వివరించి విద్యార్థులు మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్స్ విజయ్ వినోద్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!