ఏ.ఐ.ఎస్.బి అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష
పరీక్ష పత్రాలను ఆవిష్కరించిన ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్
వరంగల్, నేటిధాత్రి
అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఎల్బీనగర్ విస్డమ్ హైస్కూల్లో పరీక్ష పత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది , ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హకీమ్ నవీద్ పాల్గొని మాట్లాడుతూ ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత పరీక్ష పత్రాలను తయారుచేసి పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించి ముందస్తుగా మెయిన్ ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నల పట్ల విద్యార్థులకు ఉన్నటువంటి సందేహాలను దూరం చేయడమే కాకుండా, విద్యార్థులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడంకై ఏ.ఐ.ఎస్.బి కృషి చేస్తుందని ఆయన కొనియాడారు , విద్యార్థులు రంగ సమస్యల పట్ల పోరాటాలతో పాటు, పరీక్షలలో ఉన్నతమైన ఉత్తీర్ణులు సాధించడానికి కృషి చేయాలని ఆయనే పిలుపునిచ్చారు కార్యక్రమంలో విస్డమ్ హై స్కూల్ కరెస్పాండెంట్ నేహాల్, విస్డమ్ జూనియర్ కాలేజి డైరెక్టర్ పర్వేజ్, ఏ.ఐ.ఎస్.బి నాయకులు ప్రవీన్, మోహన్ , నితిన్ తదితరులు పాల్గొన్నారు.