విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మరిపెడ నేటి ధాత్రి.

మరిపెడ మండలo లో ని నాలుగు మండలాల గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం ఆధ్వర్యంలో మంచ్య తండాలో నిర్వహించడం జరుగుతుంది.ఎల్లంపేట కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గండి సుమలత వీరభద్రం మాట్లాడుతూ దసరా సెలవులు వచ్చినందున యువత కోరిక మేరకు కబడ్డీ ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. చదువుతోపాటు విద్యలో కూడా రానిస్తే ఉన్నత భవిష్యత్తు,స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు.దసరా సెలవులో వచ్చిన యువతకు చెడు వ్యసనాల వైపు ఆలోచన వెళ్లకుండా ఉండడానికి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు.కబడ్డీ ఆటలకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ ఉందన్నారు. క్రికెట్ ఆటతో పాటు సమానంగా కబడ్డీ ఆటకు కూడా ప్రేక్షక ఆదరణ పెరిగిందన్నారు.17,18,19 తేదీలలో కబడ్డీ ఆటలు నిర్వహించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 5016 రూపాయలతో పాటుగా ఫీల్డ్, రెండవ బహుమతి 3016 రూపాయలతో పాటు ఫీల్డ్ అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు బుచ్చిబాబు,ఉపాధ్యక్షులు కొంపేల్లి వెంకన్న,మనోజు, వంశీకృష్ణ,వీరన్న,మూడ్ వీరన్న,నవీన్,కొండలరావు శివలింగయ్య,దండి ఉమేష్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *