వీణవంక,(కరీంనగర్ జిల్లా),
నేటిదాత్రి: వీణవంక మండల కేంద్రానికి చెందిన పాత్రికేయుడు పత్తి కొండాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడటంతో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల 2009 బ్యాచ్ విద్యార్థులు వారి వంతుగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరే రవికుమార్, చిన్నాల అనిల్, పూదరి అనిల్, మేడుదుల నాగరాజు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.