
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తవక్కల్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్ పై అవగాహన కల్పించారు…. ఈ సందర్బంగా షీ టీం సభ్యులు కానిస్టేబుల్స్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అన్నారు.పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సైబర్ నేరాల గురించి వివరించారు. ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని తెలిపారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో షీ టీం సభ్యులు మహిళా కానిస్టేబుల్ జ్యోతి, పాఠశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.