మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు…

మంత్రికి వినతి పత్రం ఇచ్చినవిద్యార్థి యువజన సంఘాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ కళాశాల హాస్టల్ కు మంత్రి అడ్లూరీ లక్ష్మణ్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు. రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన పై వారు విద్యార్థులతో మాట్లాడిన అనంతరం భూపాలపల్లి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్ ప్రజా సంఘాలు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్, భూక్యా నవీన్ నాయకులు మాట్లాడుతూ వరుసగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు తరచూ ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థినిలపై దాడులు, కరెంటు షాక్ ఇతర సంఘటనల వల్ల అధికారుల లోపం స్పష్టంగా కనబడుతుందని తెలిపారు. కేవలం జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచూ ఇలాంటి ఘటన జరుగుతూ విద్యార్థులు ఆవేదన గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను కేటాయించినప్పటికీ ఎవ్వరు కూడా నెలలో కనీసం ఒక్కరోజు కూడా హాస్టలకు రాకపోవడం, వారి సమస్యలు తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అధికారులు,విద్యార్థి యువజన సంఘాలతో కమిటీ వేసి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. జిల్లాలో వారానికి ఒకసారైనా కలెక్టర్ ప్రతి ప్రభుత్వ హాస్టల ను పర్యటించాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version