Human Rights Awareness Rally in Mandamarri
మానవ హక్కుల అవగాహన కై విద్యార్థుల ర్యాలీ
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి పట్టణంలో మానవ హక్కుల అవగాహనకై పాఠశాల విద్యార్థులచే ర్యాలీమందమర్రి పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులచే మానవ హక్కుల పై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ మహిళా మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వీస్ సెక్యూరిటీ మందమరి కే భువనేశ్వరి ప్రిన్సిపల్ ఎన్జీవో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడానికి హక్కులను విధులను ఏర్పాటు చేయడం జరిగిందని మానవ హక్కులను మనమంతా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కుల మత భేదాలు లేకుండా సమానత్వంగా జీవించడానికి మానవ హక్కుల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులను కూడా ఏర్పాటు చేసిందని వాటిని అనుసరిస్తూ రాజ్యాంగబద్ధంగా విధానం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా పాఠశాల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
