
School Awards Program.
ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ అందజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంఘం మండలం బిడెకన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. జూలై నెలలో క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు గోరకనాథ్ ఈ అవార్డును అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.