
polytechnic college,
సబ్జెక్ట్ తప్పడంతో విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న అక్షయ్ (20) హనుమకొండలోని రెవెన్యూ కాలనీలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటఫణి శనివారం తెలిపారు.అక్షయ్ రెండు నెలల కిందట పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు.ఇటీవల పరీక్షల ఫలితాలు విడుదల కాగా అందులో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు.కొద్ది రోజుల నుంచి మానసిక ఆందోళనకు గురైన అక్షయ్ ఓ గదిలో ఫ్యానుకు ఉరేవేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.