ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోవిద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు
పరకాల,నేటిధాత్రి
ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు బొచ్చు ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీ కాలేజ్ చైర్మన్ శ్రీనివాస్ చారి మరియు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సంతోష్ హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు దేశంలో విద్యార్థులు మత్తుకు బానిసలావుతున్నారని చదువుకు దూరం అవుతూ మత్తుకు బానిస అవుతూ చదువుని దూరం చేసుకుంటు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చకుండా మత్తుకు బానిసై వారి నాశనం చేసుకుంటున్నారని విద్యార్థులు చదువుకొని తల్లిదండ్రులకు మరియు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు కార్యదర్శులు చెన్నూరు సాయికుమార్, బీరెడ్డి జస్వంత్,జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొజ్జ హేమంత్, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
