ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం

# ఈనెల 16 న గ్రామీణ భారత్ బంద్ ఎం సిపిఐ(యు) మద్దతు.
# జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అన్నారు. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ కార్యదర్శి అనుమాల రమేష్ అధ్యక్షతన జరిగింది. రాజమౌళి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలపై తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు , రైతులు,కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక , మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష , ప్రజాతంత్ర శక్తులు , లౌకిక శక్తులు ఐక్యం కావాలన్నారు.బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన బంధు సమ్మెకు సంపూర్ణ మద్దతుందన్నారు.
ఈ సమావేశంలో నాయకులు కేశెట్టి సదానందం, గాదగోని బాబు,అనుమాల రమేష్,వక్కల రాజమౌళి,గుర్రం రవి,కేశెట్టి శ్రీనివాస్, ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *