డిండి ఎత్తిపోతల పథక0 డిపిఆర్ ను ఆమోదించే వరకు పోరాటం ఆగదు : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్గొండజిల్లా, నేటిదాత్రి :

నల్లగొండ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డి0డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం ఆగదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు..
బుధవారం చండూరు మండల పరిధిలో ని బోడంగిపర్తి గ్రామం లో డిండిఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సంతకాల సేకరణకార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు. మునుగోడు,దేవరకొండ ప్రాజెక్టులకుపర్యావరణ అనుమతులు,అటవీ శాఖ అనుమతులుఇవ్వాలని.పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు తరహా మా ప్రాంతాల కూడా అన్ని అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. మా ప్రాంతాలకుసాగునీరు- త్రాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగుతుందనిఆయన తెలిపారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామనిఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్,సిపి్యం బోడంగిపర్తి గ్రామశాఖకార్యదర్శి గౌసియా బేగం, ఎస్. కే జానీపాషా, లతీఫ్, కే. స్వామి, ఖాసీసిముని, యాదయ్య, లింగయ్య
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!