ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం.

G. Nagaiah G. Nagaiah

ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ.నాగయ్య అన్నారు.
సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు పట్టణంలోని గ్రీన్ రిసార్ట్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి సీ హెచ్ రంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలే మార్గం అని అన్నారు. కేంద్రం లోని మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య కులాలు మతాల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి పాలన సాగిస్తున్నదని, దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాలరాసి నియంతృత్వ పాలన తీసుక రావడానికి బిజెపి నాయకత్వం లోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తుందని , ప్రధానంగా రైతు రుణమాఫీ, రాజీవ్ యువ వికాసం, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయడం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.బిజెపి దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో బిజెపి నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. హిందువులు పేరుతో మత రాజకీయాలు చేస్తూ హిందువులపై అదనపు ఆర్థిక భారాలు మోపడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిలో బిజెపి నేతలు వున్నారని విమర్శించారు. నూతన ఆర్థిక విధానాలతో దేశంలో సంక్షోభం ఏర్పడింది అని, మరోవైపు ప్రజలు ఉద్యమాల్లోకీ రాకుండా మతాన్ని ముందుకు తెచ్చి దేశ ప్రజలతో బిజెపి నేతలు ఆటలు ఆడుతున్నారని వారు ధ్వజమెత్తారు. హామీల అమలుకు ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పార్టి జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెళ్లి బాబు, నలిగంటి రత్నమాల సింగారపు బాబు,భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, నమిండ్ల స్వామి ముంజాల సాయిలు ఆరూరి కుమార్, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య, ఎండి బషీర్, వి దుర్గయ్య, యారా ప్రశాంత్, పట్టణ కమిటీ సభ్యులు మండల, ఏరియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!