సమస్యలపై స్పందించకపోతే త్వరలో సమ్మె సైరన్..టీజీఈజెఎసి
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ ఉద్యోగుల,గెజిటెడ్ ఆఫీసర్స్,ఉపాధ్యాయులు,కార్మికులు మరియు పెన్సనర్స్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ (టీజీఈజెఎసి) సూచనల మేరకు మంగళవారం రోజున బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలసి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించడం జరిగింది.అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు సహాయ సహకారాలు అందించి ఉద్యోగుల మరియు వారి కుంటుంబాలకు చేయూత అందించాలని కోరారు.57 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా శాసనసభ సభ్యుడు గడ్డం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరము టీజీఈజెఎసి మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ కె.వనజా రెడ్డి,మంచిర్యాల జిల్లా టీజీఈజేఏసీ తరుపున ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 15 లోపు స్పందించకపొతే మే 15 నాడు నల్ల బ్యాడిలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన మరియు ధర్నాలు చేపట్టడం జరుగుతుందని,జూన్ 9 నాడు హైదరాబాద్ లో జరిగే మహా సదస్సులో మంచిర్యాల జిల్లా తరుపున ప్రతి ఉద్యోగి పాలుగొంటారని,వర్క్ టూ రూల్,పెన్ డౌన్,సాముహిక సెలవులతో ప్రభుత్యం పై ఒత్తిడి పెంచుతామని,సమ్మె సైరన్ మోగించక తప్పదనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ గడియారం శ్రీహరి,జనరల్ సెక్రెటరీ కె.వనజా రెడ్డి,రాష్ట సెక్రెటరీ పొన్న మల్లయ్య,డిప్యూటి సెక్రెటరీ జనరల్ భూముల రామ్ మోహన్,కో-చైర్మన్ శ్రీపతి బాపూరావు,చక్రపాణి,రవి,చెన్న కేశవులు,సుధాకర్, గోపాల్,వెంకటేశం మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.