
Zaheerabad
మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, సహకరించినా జైల్ కే
◆:- ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:

యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మాయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారని, ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు ఎవరైనా అతనికి సహకరించినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరించారు. మైనర్ బాలికలను వేధిస్తే పోక్సో చట్టం ప్రకారం 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు