సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్.
చిట్యాల, నేటి ధాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అనుమతి లేకుండా నవాబుపేట చలివాగు మరియు మానేరు వాగుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు, అలాగే అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించామని అలాగే అతిక్రమించిన వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ చేసి కూడా పెడతామని అన్నారు గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైనా తమ దృష్టికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరినారు,