నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు.

Fake Seeds. Fake Seeds.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

 

ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్ స్థానిక ప్రజలకు రైతులకు నకిలీ విత్తనాలు, సైబర్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలపై వారికి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దే విత్తనాలు తీసుకోవాలన్నారు. వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు. అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ వద్దే దాచాలన్నారు. ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను, కంపెనీని, బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని, ఆ ఆర్గనైజర్, కంపెనీపై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!