నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

 కొల్చారం మండల బి ఆర్ ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకులపల్లి సంతోష్ రావు….

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొల్చారం మండలం బిఆర్ఎస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడు తుంకలపల్లి సంతోష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకుంటూ, మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా గుండాయిజం చేస్తే ప్రజాపాలన.. లేక రౌడీయిజం పాలననా అది కాంగ్రెస్ కార్యకర్తలకే గుర్తుండాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *