సింగరేణి జిఎం కి వినతిపత్రం అందించిన మాజీ ఎంపీటీసీలు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రామారావుపేట గ్రామం లో సిఎస్ఆర్ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు టెండర్ రద్దు చేయాలని స్థానిక మండల మాజీ ప్రజా ప్రతినిదులు కోరారు. శనివారం సీసీ రోడ్డు రద్దు పై శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సూర్యనారాయణకు ఇందారం మాజీ ఎంపీటీసీ 2 అరికె సంతోష్ తో పాటు రామారావు పేట మాజీ ఎంపీటీసీ పెద్దల బాబు వినతి పత్రం అందజేశారు.స్థానిక గ్రామ పరిసర ప్రాంతంలో 95 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన రైస్ మిల్ కొరకు నిధులు దుర్వినియోగంగా బీటీ రోడ్డు వెయిటకు సింగరేణి అధికారులు టెండర్ నిర్ణయించినట్లుగా గ్రహించాలని పేర్కొంటూ,సిఎస్ఆర్ నిధులను సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం వినియోగించాలని కోరినట్లుగా వినతిపత్రంలో తెలిపారు.