కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం: నాజియా అంజుమ్ షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్
హెచ్చరించారు. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని, సీఎం రేవంత్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి కేసీఆర్ను మానసికంగా వేధించే కుట్రలో భాగమే ఈ నోటీసులు అని, తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ బెదరరని అన్నారు.
