ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీని పరామర్శించారు

Date 20/7/2024
—————————————-
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల అస్వస్థతకు గురైన మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీని పరామర్శించారు

ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రంతో కలిసి శనివారం ఉదయం ఖమ్మంలోని గాంధీ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు

గాంధీ ఇటీవల అస్వస్థతకు లోనై హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ఖమ్మంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు

ఆకుల గాంధీని ఎంపీ వద్దిరాజు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, త్వరితగతిన కోలుకుని నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆకాంక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *