పేద విద్యార్థికి స్టేట్ ర్యాంక్
బాలానగర్ నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో పదో తరగతి విద్యార్థి అమూల్య నిన్న వెలువడిన టీజీఆర్ జేసీ ఫలితాలలో.. ఏంఈసీ విభాగంలో స్టేట్ 1 ర్యాంకు సాధించింది. కొత్తకోట చెందిన సువర్ణ మల్లేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కూతురు అమూల్యను బాలానగర్ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. స్టేట్ బ్యాంకు సాధించడంతో పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.