జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ సమక్షంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారులు తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని,వెహికిల్ అలవెన్సులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వేంకటేశ్వర రావు,బెల్లంపల్లి ఇంచార్జీ డి ఎల్ పి ఓ సఫ్తర్ అలీ,జైపూర్,చెన్నూరు,
బెల్లంపల్లి మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు,అజ్మత్ అలీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.