
State Minister Uttam Kumar Reddy
జూరాలలో ఐరన్ రోప్ లు తేగడంపై రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటనలో
పరిశీలన చేయకపోవడంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శ
వనపర్తి నేటిదాత్రి :
జూరాల ప్రాజెక్టు పర్యటనలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఐరన్ రో ప్ లు తెగిపోవడంపై కనీసం పరిశీలన కూడా చేయలేదని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని ఆయన తెలిపారు