
State Formation Day
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు
బలుగూరి తిరుపతిరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగురు తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా బారాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు పోరాటం ద్వారా అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమళ్ళ రమేష్ మల్సాని బాపురావు దేవునూరికుమారస్వామి బొల్లేని రవికుమార్ ఎల కంటి మూర్తిలింగాచారిపడిదల జగ్గారావు బండారి రామస్వామి చెక్క సురేష్ వనం కార్తీకు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు