
State Secretary Pays Condolences to Bereaved Family
భాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
దామెర మండలంలోని కొగిల్ వాయ్ గ్రామానికి చెందిన జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి కొండి మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా దశదినకరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్,మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారయణ రావు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్,మాజీ మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు,గంకిడి బూచి రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.