డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన దోస్త్ మూడవ విడత అడ్మిషన్ ల ప్రక్రియ
కళాశాల ప్రిన్సిపాల్ ఎం.సంతోష్ కుమార్
పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్)తెలంగాణ మూడో విడత అడ్మిషన్లు ప్రక్రియ 13వ తేదీ నుండి ప్రారంభమైందని అలాగే రెండో విడత అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ మేతి సంతోష్ కుమార్ తెలిపారు.దోస్త్ ప్రక్రియలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక ఇబ్బందులు కలిగితే కళాశాలకు వచ్చి సహాయక కేంద్రంలో పరిష్కారం పొందగలరని కళాశాల సహాయక కేంద్రంలో విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేయబడుతుందని డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ మూడో విడత 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్ధారించడం జరిగిందని జూన్ 3వ తేదీ నుండి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అయన తెలిపారు.