సన్న బియ్యం పంపిణిని ప్రారంభం
గంగారం, నేటిదాత్రి:
గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి సన్న వడ్ల కు క్వింటకు 500 రూపాయల బోనస్ కల్పిస్తూ వారికీ గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈసం రమ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మంకిడి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు,మహిళా లు తదితరులు పాల్గొన్నారు…