కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు.మహబూబాబాద్ ఎంపీ మరియు జిల్లా భారాస పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత,ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ముఖ్య అతిథిలుగా హాజరైన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి మంట తెలిసిన గొప్ప సీఎం కెసిఆర్ అని విద్యార్థులకు కడుపునిండా తిండి ఉన్నప్పుడే వారు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.సీఎం కెసిఆర్ విద్యా విధానంలో సములా మార్పులు తెచ్చారని కొనియాడారు.సీఎం కెసిఆర్ ప్రభుత్వము చేస్తున్న ప్రతి పని అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని,ప్రతి విద్యార్థి మంచిగా చదివి భవిష్యత్ లో గొప్ప స్థానానికి చేరుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మార్కేట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్,సర్పంచ్ రావుల విజిత రవిచంధర్ రెడ్డి, కమటం శ్రీను,మండల & గ్రామ భారాస నాయకులు,అధికారులు, గ్రామ ప్రజలు,విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.