
Constituency In-charge Hanumandla Jhansi Rajender Reddy
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
-టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా శనివారం పట్టణంతోపాటు మండలంలోని చర్లపాలెం, గోపాలగిరి, గుర్తురు, చింతలపల్లి, కొమ్మనపల్లి తండ గ్రామాలలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలను ఎల్లవేళలా అన్ని విధాలుగా కాపాడుకుంటామని,పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను అన్ని విధాలుగా అండగా నిలుస్తానని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్ని స్థానాలలో గెలిపించి సత్తా చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, మంగళపల్లి రామచంద్రయ్య,జినుగా సురేందర్ రెడ్డి, జక్కుల రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి,కందాడి అచ్చిరెడ్డి,పెరటి యాకూబ్ రెడ్డి,కాందాడి అశోక్ రెడ్డి,కంచర్ల వెంకటాచారి, ధరావత్ సోమన్న, పంజా కల్పన,మోత్కూరి రవీంద్ర చారి, బాలకృష్ణ,రాజేష్ యాదవ్, మహేష్ యాదవ్,పాడ్యా రమేష్ నాయక్,వల్లపు మల్లయ్య, ధర్మారపు మహేందర్, యనమల శ్రీనివాస్,అలువాల సోమయ్య, వెలుగు మహేశ్వరి,తోట అశోక్,మనోహర్, వెంకన్న, ఉపేంద్ర,గిరిధర్, పరశురాములు,బుచ్చి రాములు,మురళి తదితరులు పాల్గొన్నారు.