‘పంట మార్పిడితో సుస్థిర ఆదాయం’
జహీరాబాద్ నీటి ధాత్రి:
సంగారెడ్డి: కొత్తూరు రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయం పొందవచ్చని తెలిపారు.