Grand Felicitation for Teachers
SSC పూర్వ విద్యార్థుల,గురువులకు ఘన సత్కారం
స్వర్ణోత్సవ వేడుకల సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని SSC -1975-76 బ్యాచ్ 2026 నాటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా తమకు విద్యాబోధ చేసిన గురువుల పట్ల కృతజ్ఞతాభివందనంగా ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని చేపట్టారు.స్వర్ణోత్సవ వేడుకలకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన గౌరవనీయ గురువులు కాచం వెంకటేశం , పత్తిపాక ఆనందం వారి స్వగృహాల్లో గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు, నూతన వస్త్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు గాజుల ప్రతాప్, బూర దేవానందం, కరుణాల భద్రాచలం, బోడ రవి, పాశికంటి శంకర్, తమ్మిశెట్టి ప్రసాద్, కట్టా శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అంబరీషం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమ జీవితాల్లో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు
