శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం.

program

మల్యాల గ్రామంలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం.
– ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన చందుర్తి,

నేటి ధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం రోజున ఆలయ రాజగోపుర ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి, స్వామి వారి శిష్య బృందం కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో సాంప్రదాయ బద్దంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాదాడి కిషన్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు కందాలయ రమణచార్యులు, ప్రముఖులు అల్లాడి రమేష్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్ చిర్రం తిరుపతి, ఈసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ విద్యాలయం చిన్నారుల నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!