కన్నుల పండుగగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం…

కళ్యాణం…… కమనీయం……

రామకృష్ణాపూర్, మార్చి 26 ,నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల శ్రీశ్రీశ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే అర్చకులు సముద్రాల కరుణాకర్ ఆచార్యులు మాట్లాడుతూ….. స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా బలిహరణ, విష్ణు సహస్రనామ పారాయణం, నిచ్చ హోమములు, పల్లకి సేవ ఆరగింపు కార్యక్రమాలు నిర్వహించమని తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో
తిరువరంగం భరత్ కుమార్ ఆచార్యులు,అలహరి కిరణ్ కుమార్ ఆచార్యులు ,సముద్రాల కరుణాకర్ ఆచార్యులు,పరావాస్తు నరేష్ కుమార్ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *