భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయంలో గత 14 సంవత్సరాలుగా వనదేవతల ఆశీస్సులు, కృపాకటాక్షాలతో భక్తులచే సాంప్రదాయంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవము ఆహ్వానమును భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు ఆలయ ధర్మకర్తలు మరియు జాతర నిర్వాహకులు కుంజా ధర్మారావు, కుంజా సంతోష్ కుమార్, కుర్సం విశ్వశాంతి అందచేశారు.
ఈ గిరిజనుల ఇలవేల్పుల జాతర ది. 22-04-2024 నుండి ది.24-04-2024 మూడు రోజుల వరకు ఘనంగా నిర్వహించబడుతుందని, కావునా శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దైవ సేవలో భక్తులందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కాగలరని ఆశిస్తున్నామని జాతర నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, చిట్టిబాబు, పుల్లగిరి నాగేంద్ర, ఎండి నవాబ్, బంబోతుల రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.