Bhoomi Pooja Held for Sri Rama Anjaneya Temple
శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి
టేకుమట్ల మండల కేంద్రంలో నిర్మించబడనున్న శ్రీరామాంజనేయ ఆలయం ఆలయ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి హాజరై వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీర్తీ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలయాలు కేంద్ర బిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయం అని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్ర రెడ్డి మండల అధ్యక్షులు గుర్రపు నాగరాజు గౌడ్
మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా కోరసురేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య సుబ్బక్కపల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ చాటకూల్ల తిరుపతి మేకల వీరారెడ్డి పంజాల కుమార్ శ్రీపతి శివ నూనెటి అరుణ్ కుమార్ బండపల్లి ఉపసర్పంచ్ ఆర్ అశోక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
